కాటారం విద్యానికేతన్ పాఠశాలలో మాక్ పోలింగ్

Written by telangana jyothi

Published on:

కాటారం విద్యానికేతన్ పాఠశాలలో మాక్ పోలింగ్

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం విద్యాని కేతన్ పాఠశాల లో శనివారం విద్యార్థులకు నమూనా పోలిం గ్ నిర్వహించి, తద్వారా ఓటింగ్, ఎన్నికల విధానం పై అవ గాహన కల్పించారు. కరస్పాండెంట్ బుర్ర వెంకటేష్ గౌడ్ ఉపా ధ్యాయుల బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగిం చుకునేందుకు విద్యార్థినీ, విద్యార్థులు బారులు తీరారు. నామి నేషన్లు దాఖలు చేయడం, బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్ని కల్లో గెలుపొందిన విద్యా ర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఓటర్లుగా,అభ్యర్థులుగా, ఎన్నికల అ ధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహ రించారు. దీంతో విద్యానికేతన్ పాఠశాల లో ఎన్నికల వాతావ రణం నెలకొంది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సుజ రాణి, ఉపాద్యాయులు, విద్యార్థులు, వర్కర్స్ పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now