ఆదర్శ విద్యార్థులను అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, తెలంగాణ జ్యోతి : పదవ తరగతిలో అగ్రశ్రేణి ఫలితాలు సాధించిన మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం అభినందించారు. 574 మార్కులు సాధించిన సిరిచందన, సాయిచరణ్య 565, అమూల్య 558 లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శాలువాతో సన్మానించి, అభినం దించారు. పదో తరగతిలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆదర్శ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయ మని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ జనగామ కార్తీక్ రావు, తదితరులు ఉన్నారు.