మారుమూల అటవీ ప్రాంతంలో మంత్రి శ్రీధర్ బాబు పల్లెనిద్ర.
పలిమెల, తెలంగాణ జ్యోతి : మంథని నియోజకవర్గం లో ఘన విజయం సాధించాక కూడా రాత్రి, పగలు అనకుండా శ్రమకి ఓర్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో నే ఉంటూ సమస్యలు తీర్చే మంత్రి మహా నాయకడు పల్లె నిద్రలో భాగంగా సోమవారం రాత్రి మారుమూల అటవీ ప్రాంతమైన పలిమెల మండలంలోని పలు గ్రామాలకు పల్లెనిద్రకు వెళ్లి ప్రజలతో మమేకమై వాడవాడల కలియ తిరుగుతూ వారి సమస్యలను వింటూ అధికారులకు తెలియజేసి పలు సూచనలు చేయడం జరిగింది. అధికారులను గ్రామంలోని సమస్యలు లేకుండా చేసి జిల్లాలోనే ఉత్తమ మండలం గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలు చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మంత్రి పలిమెల మండలం లోని పలు గ్రామాలలో పల్లెనిద్ర చేయడం వలన మండల, గ్రామ ప్రజలు ,కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.