డిసెంబర్ 9న బందుకు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
– చల్పాక అడవుల్లో బూటకపు ఎన్కౌంటర్
– ఏడుగురిని విషమిచ్చి చంపేశారు
– మావోయిస్టు పార్టీ తెలంగాణా అధికార ప్రతినిధి జగన్
-కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాకలో జరిగింది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని, ద్రోహి ఇచ్చిన సమాచారంతో విషమిచ్చి ఏడుగురుని పొట్టన పెట్టుకున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఎన్కౌంటర్ కు నిరసనగా డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్త బందు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పూలకొమ్మ తోగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారన్నారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో వున్న మా దళం చల్చాక పంచాయితీలో వున్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారని, ముందుగానే పోలీసులకు అప్రూవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజ నంలో విషం ఇచ్చి స్పృహం కోల్పోయే లాగా చేశారన్నారు. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుఝామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారని విమర్శించారు. శతృవు మోసపూరిత పథ కంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుసం మంగు @ పాపన్న, భద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లయ్య @(మధు, కోటి జెఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్బుడు), ముచాకీ అందాల్ @ కరుణాకర్ (ఇల్లెందు- నర్సంపేట్ ఏరియా కమిటి సభ్యుడు), ముచాకీ బూమే@ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు), పూనెం చోటు @కిశోర్( రీజినల్ కంపెనీ-2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడు), కర్ణం కామాల్ (రీజినల్ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్ సభ్యుడు), కా. జైసింగ్ (ఏటూర్ నాగారం- మహదేవ్ పూర్ ఏరియా దళం సభ్యుడు)లు ప్రాణాలర్పించారన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు పేరు పేరున తెలం గాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్య కాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తోందని, యావత్ పీడిత ప్రజలు, ప్రజా స్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థ లు బందును పాటించి జయప్రదం చేయాలని కోరారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరి పి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని, ప్రజా ఉద్యమాలను అణిచి వేయడానికి, ప్రజా పోరాటా లకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ ను కొన సాగిస్తున్నారన్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పూల కొమ్మ తోగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని జగన్ కోరారు.