వెంకటాపురం పట్టణంలో పిచ్చికుక్క సైరవిహారం

వెంకటాపురం పట్టణంలో పిచ్చికుక్క సైరవిహారం

వెంకటాపురం పట్టణంలో పిచ్చికుక్క సైరవిహారం

– 15 మంది కి గాయాలు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పట్టణ కేంద్రం అప్పాల వారి వీధిలో శుక్రవారం ఉదయం పిచ్చి కుక్క స్వైర విహారం చేసి అదే వీధిలో నడిచి వెళుతున్న 15 మందిని కరిచింది. దీంతో ప్రజలు కర్రలు పట్టుకొని కుక్కను తరిమి కొడుతూ హతమార్చారు. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో ఏ వీధిలో చూసినా వందలు, వేల సంఖ్యలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎదురుపడిన వారిని కరుస్తున్నాయి. మెతకు వెళ్ళి న పశువులను, దూడలను కుక్కల గుంపులు చంపి వేస్తున్నాయి. ఊర కుక్కల బారి నుండి తమను కాపాడాలని ప్రజలు గ్రామపంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment