ఆదివాసుల మనుగడను రక్షించుటకై ఉద్యమిద్దాం

ఆదివాసుల మనుగడను రక్షించుటకై ఉద్యమిద్దాం

ఆదివాసుల మనుగడను రక్షించుటకై ఉద్యమిద్దాం

– ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు ఉయిక శంకర్

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 20 న ఏటూరు నాగారం ఐ టి డి ఏ ముందు ఆదివాసి సమస్యలను పరిష్కరించుటకై ర్యాలీ, మహా ధర్నా నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శనివా రం ఏఎస్పీ ఆధ్వర్యంలో నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు ఉయిక శంకర్,  ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్, ఏటూరు నాగారం డివిజన్ అధ్యక్షులు టింగా భుచ్చయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 5దో ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలు, 1/70 చట్టం, గిరిజన సంక్షేమ‌, హక్కుల చట్టాలు వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, పాలకు లకు ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏజెన్సీ ప్రాంతా ల్లో చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏజెన్సీలో గిరిజ నేతరులకు, అన్ని విధాలుగా హక్కులు కల్పిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు .ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు పోడు సాగు వ్యవసాయం చేసుకుంటు ఉంటే, ఫారెస్ట్ అధికారులు ఆదివాసులపై దౌర్జ న్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఆదివాసులను వేధిస్తు న్నారని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకుంటూ, ఏజెన్సీ ప్రాంతాలు చట్టాలను తుంగలో తొక్కుతూ గిరిజన ఇతరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఉన్న, అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్ష పళ్ళు గా మారాయని వాపోయారు. అందుకే మన ఐటీడీఏ ఏటూరునాగారం నందు మన హక్కులు, మన చట్టా లు, మన ఉద్యోగం, మన ఉపాధి, మనభూమి, మన రిజర్వే షన్, మనగడలను రక్షించుటకై 20 జనవరి 2025 న ఏటూరు నాగారం ఐటీడీఏ లో ర్యాలీ, మహా ధర్నాను జయప్రదం చేయా లని, ఆదివాసి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల నాయకులు తుర్స కృష్ణ బాబు, లోడిగ నరసింహరావు, తాటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment