2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..!
హైదరాబాద్,తెలంగాణ జ్యోతి : 2020 ఎల్ఆర్ఎస్ దరఖా స్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్ ల క్రమ బద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకు న్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో 20లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.