పంచాయతీ అభివృద్ధి కోసం కారం కన్నయ్య చేసిన సేవలు మరువరానివి

పంచాయతీ అభివృద్ధి కోసం కారం కన్నయ్య చేసిన సేవలు మరువరానివి
  • పంచాయతీ అభివృద్ధి కోసం కారం కన్నయ్య చేసిన సేవలు మరువరానివి

– మండల కాంగ్రెస్ సంతాపం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర సర్పంచ్ గా కారం కన్నయ్య ఐదు సంవత్సరాలు పాటు పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ఆయన చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచి పోతాయని వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఎదిర గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు పాటు పనిచేసిన కన్నయ్య ఇటీవల నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఆయన చేసిన సేవలు చిరస్మర ణీయమని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ నాయ కులు సొసైటీ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడం సాంబశివరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాముల రమేష్, నాయకులు జి. నాగేశ్వర రావు, గుండ మళ్ళ కిరణ్, ఎడ్ల క్రాంతి, చిడెం నగేష్, రవి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment