టూరిజం హబ్ గా కాళేశ్వరం

టూరిజం హబ్ గా కాళేశ్వరం

టూరిజం హబ్ గా కాళేశ్వరం

– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం ను టూరిజం హబ్ గా చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మే 15 నుండి 26వ తేదీ వరకు 12 రోజులపాటు జరిగే సరస్వతి నది పుష్కరాల సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి ప్రాణహిత నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద వి ఐ పి పుష్కర ఘాట్, గోదావరి నది ఘాట్ల వద్ద జరుగుతున్న మెట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను పుష్కరాల నాటికి ముందే పరితగతిన పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. గోదావరి నది లో గుడ్డలు, చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండేలా క్లీన్ చేయించాలని జిల్లా పరిషత్ సీఈఓ ను మంత్రి ఆదేశిం చారు. వంద గదుల అతిథి గృహంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హరిత గృహంలో జిల్లా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల మరణించిన మాజీ సర్పంచ్ రామ్ నారాయణ గౌడ్ కుటుంబాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ఓదార్చారు. మహదేవపూర్ మండలంలోని ఎల్కేశ్వరం గ్రామం లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.  పుష్కర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు సమయానుకూలంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్దిద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరిలో వ్యర్దా లు తొలగించి పరిశుభ్రం చేయాలని సూచించారు. సమయం చాలా తక్కువగా ఉందని, ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు పనులు జరగలేదని అధికారులు గుర్తించి నిర్దిష్ట కార్యాచరణతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసర మైన సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పనులు వేగవంతం చేసేందుకు కూలీలను పెంచాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు.

యాక్సిడెంట్ బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు చేయూత

మంత్రి శ్రీధర్ బాబు మహాదేవపూర్ మండలంలోని ఎల్కేశ్వరం గ్రామానికి వెళ్తుండగా బొమ్మాపూర్ క్రాస్ రోడ్ వద్ద కారు ఆటో యాక్సిడెంట్ జరిగింది మంత్రి శ్రీధర్ బాబు చూసి చలించి వాహనాన్ని అక్కడే నిలిపి ఆక్సిడెంట్ లో జరిగిన బాధితులకు వెంటనే వైద్యసహాయం అందించేందుకు మంత్రి కాన్వాయ్ కారు లో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పలువు రికి వైద్యశాల అందించి చికిత్స చేయాలని అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment