భూపాలపల్లిలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్

భూపాలపల్లిలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్

భూపాలపల్లిలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్

– ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాటారం, తెలంగాణజ్యోతి: రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 13వ తేదీ వరకు జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పట్టణశాఖ అధ్యక్షుడు దేవన ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపాలి టీ పరిధిలోని 16, 17, 29 వార్డులు రామ్ నగర్, సుభాష్ కాలనీలల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆద్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపూ, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జరిగింది. ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. బాపూజీ, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూల మాల వేసి, రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి యాత్రను ప్రారంభించారు. యాత్ర అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. గ్రామ, మండ ల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పాదయాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాలనీ వాసులు వారి సమస్య లను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment