కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేయడం తగదు

కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేయడం తగదు

కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేయడం తగదు

– రాహుల్ గాంధీ పోరాటంతోనే ప్రధాని కులగణన ప్రకటన 

– ప్రజాస్వామ్య రక్షణకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ 

– మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క 

– భారీ గజమాలతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కేంద్రంలోని బీజేపీ కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోందని, ఇది దుర్మార్గమైన ఆలోచన అని రాష్ట్ర బీసీ సంక్షేమం, రోడ్లు, భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి  సీతక్క విమర్శించారు. ఆదివారం ములుగు లోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరు కాగా భారీ గజమాలతో స్వాగతం పలికారు. మొదట గట్టమ్మ వద్ద పూజలు నిర్వహించి ములుగు కు భారీ ర్యాలీలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు పోతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ కులమతాల మధ్య చిచ్చుపెడుతున్న కారణంగా దేశ విచ్ఛిన్నానికి దారితీస్తున్నార న్నారు. దేశ నిర్మాణం ఉన్నతంగా జరగాలని కాంగ్రెస్‌ కోరుకుం టోందని పేర్కొన్నారు. దేశంలోని వనరులు, సంపద దేశ ప్రజలం దరికీ సమానంగా పంచాలన్నారు. బహుళజాతి సంస్థల కోసం ఆలోచిస్తున్నారే తప్ప దేశ ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం ఆలోచించడం లేదని వారు ఆయన అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవే యాలని మంత్రి సూచించారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థల న్నింటిని నిర్వీర్యం చేస్తూ, అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుం టుందో తెలియజేయాలన్నారు. బీజెపి ప్రజా వ్యతిరేక విధానా లను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఇంచార్జీలు కైలాష్ నేత, సాంబయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment