ఎన్ హెచ్ఆర్సీ&డబ్ల్యూఈఓ ములుగు జిల్లా కార్యాలయం ప్రారంభం

Written by telangana jyothi

Published on:

ఎన్ హెచ్ఆర్సీ&డబ్ల్యూఈఓ ములుగు జిల్లా కార్యాలయం ప్రారంభం

– ములుగు జిల్లా అధ్యక్షుడిగా దబ్బకట్ల మనోజ్

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జాతీయ మానవ హక్కుల పిల్లలు & ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ములు గు జిల్లా కార్యాలయాన్ని సంస్థ జాతీయ అధ్యక్షుడు ఫౌండర్ మహమ్మద్ మొహీనుద్దీన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మొహీనుద్దిన్ మాట్లాడుతూ మానవ హక్కుల వాటి వల్ల జరిగే ప్రయోజనాలు గ్రామ గ్రామాన ప్రతీ మహిళలకు, పిల్లలకు చేరాలని అందుకోసమే జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని అన్నారు. సమాజంలో మహిళలకు,పిల్లలకు భద్రత కల్పిస్తూ వారి హక్కులను ఎలా పొందాలనే అనే అంశంపై వారిలో అవగా హన కల్పిస్తూ గ్రామంలో కమిటీలు వేస్తున్నామని అన్నారు. అలాగే ములుగు జిల్లా అధ్యక్షుడిగా దబ్బకట్ల మనోజ్ కుమార్ ను నియమిస్తున్నట్లు చైర్మన్ మొయినుద్దీన్ తెలి పారు. జాతీయ మానవ హక్కుల పిల్లలు & ఉమెన్ ఎంప వర్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి న్యాయం జరిగిం దని అలాగే ఎవ్వరికైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మా ఆర్గనైజేషన్ ను సంప్రదించి తగు న్యాయం పొందవచ్చని చైర్మన్ తెలియజేశారు.ఈ ఆర్గనైజేషన్ లో మహిళలు పెద్ద ఎత్తున సభ్యత్వం పొందడం శుభసూచకమని చైర్మన్ మొహీ నుద్ధిన్ అన్నారు.త్వరలోనే అన్ని జిల్లాల్లో మహిళా విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్ర మంలో జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు సంపెట సుధాకర్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఫరానా సుల్తాన, ఉపాధ్యక్షుడు కళ్యాణి,సిద్దిపేట జిల్లా అ ధ్యక్షురాలు మంజుల, మూడు జిల్లాల ఇంచార్జులు గణిపాక కుమార్, ములుగు జిల్లా కార్యదర్శి ఎం.ప్రకాష్, ఉపాధ్యక్షుడు ఓడపల్లి సురేష్,ఆకులపెళ్లి రాజు, వివిధ జిల్లాల,మండలాల అధ్యక్షు లు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now