ఆలుబాకలో అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు..?
– పట్టించుకోని
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఆలుబాకలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాల ను ఇసుక మాఫియా తవ్వుతూ రెచ్చిపోతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము అధికార పార్టీ నేతలమంటూ ప్రభుత్వానికి రావలసిన రాయల్టీకి గండి కొ డుతూ వందలాది టిప్పర్ల గ్రావెల్ ను ఇసుక మాఫియ తరలించుకు పోతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ్వ ఉన్నతాధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.