ఇఫ్తార్ విందు సోదరభావాన్ని పెంపొందిస్తాయి : శ్రీను బాబు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : రంజాన్ పవిత్ర మాసం లో ఇఫ్తార్ విందులు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు అన్నారు. శుక్రవారం రాత్రి కాటారం మండల కేంద్రంలో బీ ఎల్ ఎం గార్డెన్ లో ముస్లిం సోదరుల కు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ 30 రోజులపాటు ముస్లిం లు ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసామన్నారు. రాబోయే రంజాన్ కి ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.