ఈనెల 25 న ములుగులో హనుమాన్ నగర సంకీర్తన
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని శ్రీ రామాలయంనుండి నగర సంకీర్తనను ఈనెల25 (శనివారం) న నిర్వహించనున్నట్లు హనుమాన్ భక్త మండలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రామాలయం నుండి మొదలై పురవీధుల గుండా నిర్వహించే నగర సంకీర్తనకు హనుమాన్ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.