ముగిసిన జీఎస్సార్ సీసీపీఎల్ సీజన్-3 ఛాంపియన్స్ క్రీడలు

ముగిసిన జీఎస్సార్ సీసీపీఎల్ సీజన్-3 ఛాంపియన్స్ క్రీడలు

ముగిసిన జీఎస్సార్ సీసీపీఎల్ సీజన్-3 ఛాంపియన్స్ క్రీడలు

కాటారం, తెలంగాణ జ్యోతి : జీఎస్సార్ సీసీపీఎల్ సీజన్ – 3 ఛాంపియన్స్ విన్నర్ గా డీఎస్ టైటాన్స్ – భూపాలపల్లి.. రన్నర్ గా రాయల్ – 11 చిట్యాల నిలిచాయి. విన్నర్ టీమ్ కు రూ.1 లక్ష.. రన్నర్ టీంకు రూ.50 వేలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పంపిణీ చేశారు. చిట్యాల గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగాణంలో శనివారం సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు క్రీడా కారులు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని రాణించేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువు తో పాటు క్రీడల్లోనూ ముందుండాలని, క్రీడలు మానసిక ఉల్లాసా నికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయన్న ఎమ్మెల్యే అన్నారు. గెలవలేనన్న ఆశ లేనివాడు ఆటకు ముందే ఓడి పోతాడని, ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆడాలని ఎమ్మెల్యే సూచించారు. జీఎస్సార్ చిట్యాల క్రికెట్ టోర్నమెంట్ సీజన్ – 3 ఛాంపియన్స్ విన్నర్ టీంకు లక్ష రూపాయలు, రన్నర్ టీంకు యాభై వేల రూపాయలతో కూడిన జంబో చెక్కులతో పాటు మెమెంటోలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేకు సీసీపీఎల్ – 3 నిర్వాహకులు శాలువా కప్పి సన్మానం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment