500 రూ.లకే గ్యాస్ సిలెండర్ అందించాలి

500 రూ.లకే గ్యాస్ సిలెండర్ అందించాలి

– ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్ నేరుగా 500 రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని ప్రజాసంఘాల నాయకుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈరోజు కాటారంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందు మొత్తం పైసలు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకుంటే ఆ తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పైసలు జమ చేస్తాము అనే విధానాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. బ్యాంకులకు వెళ్లి పైసలు తీసుకోవాలన్నా పట్టణం మరియు మండల కేంద్రాలకు వెళ్ళక తప్పదని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తే పైసలు ప్రయాణాల ఖర్చులకే అయిపోతాయి, తీసుకోవటం ఇవ్వడం కాకుండా మొదటనే 500 రూపాయలు తీసుకొని గ్యాస్ సిలెండర్ ఇస్తే ఏ గందరగోళం ఉండదన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ పైసలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని చెప్పి రెండు మూడు నెలలు జమ చేసి ఆ తరువాత జమ చేయలేదని విమర్శించారు. మొత్తం పైసలు ముందు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకోవాలన్న పేదలకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని గమనించాలని అన్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేరుగా లబ్ధిదారులకు 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ ఇవ్వాలని పీక కిరణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అక్కల బాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment