ఉరి వేసుకుని ఎరువుల వ్యాపారి ఆత్మహత్య
– కాటారం సబ్ డివిజన్లో సంచలనంగా మారిన సంఘటన
కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శనివారం ఎరువుల వ్యాపారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. ఈ ప్రాంతంలో ఒక వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడడం మొదటిసారి. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. కాటారం మండలంలోని చిదినేపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీనివాస పల్లె గ్రామానికి చెందిన మార్క రాజేందర్ శనివారం మధ్యాహ్నం మహాదేవపూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయాలకు ఎదురుగా గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు మహాదేవపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మార్క రాజేందర్ కొన్నేళ్లుగా కాటారం మండల కేంద్రం గారెపల్లి గ్రామంలో ఎరువులు పురుగు మందుల వ్యాపారం దుకాణం ఉంది. ఈ వ్యాపారంలో కంపెనీలు రాజేందర్ కు రాజేందర్ రైతులకు పెట్టుబడులు పెడతారు. ఏడాది మిర్చి పంట వేశారు. రైతులకు పెట్టిన అప్పుల పెట్టుబడి సకాలంలో వసూలు కాకపోవడం కంపెనీలకు చెల్లించాల్సిన బకాయి ఉండడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేందర్ వ్యాపారంతో పాటు అయ్యప్ప, ఆంజనేయస్వామి దీక్షలు చేపడుతూ దైవారాధనలో ఉంటూ, అందరికీ ధైర్యం చెప్పే వాడని, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడడం ఊహించ లేని సంఘటనని రైతులు ప్రజలు వ్యాపారస్తులు పేర్కొంటు న్నారు. రాజేంద్ర ఆత్మహత్య ఈప్రాంతంలో సంచలనం రేకెత్తిం చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.