ధర్మారంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు. 

ధర్మారంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం ధర్మారం డబల్ బెడ్ రూమ్ ప్రాంగణం సమీపంలో ప్రధాన రహదారి పై, పేరూరు పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్ర మాన్ని నిర్వహించారు. మంగళవారం సాయంత్రం పేరూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో వచ్చే పోయే వాహనాలను తనిఖీలు నిర్వహించి,అపరిచిత వ్యక్తుల సమాచారాన్నిఈ సంద ర్భంగా రాబట్టారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.