వెంకటాపురంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం లో విథ్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా వెంకటాపురం సెక్షన్ నందు విద్యుత్ కార్మికులు, స్థానిక రైతులతో విద్యుత్ వినియోగించే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై క్లుప్తంగా ఏ.డి.ఈ. ఆకిటి స్వామి రెడ్డి అవగాహన కల్పించారు. సిబ్బంది విద్యుత్తు మరమ్మత్తులు, లైను, నియంత్రికల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిం చారు. రైతులు వారి వ్యవసాయ క్షేత్రాల వద్ద మోటార్లు, నియం త్రికలు, లైను తదితర పరికరాల వద్ద లోపాలు ఏర్పడినట్లయితే విధిగా విద్యుత్ సిబ్బందికి తెలియజేసి, వారి సహకారంతో విద్యుత్తును పునరుద్ధరించు కోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో వెంకటాపురం ఏఈ హనుమాన్ దాస్, సబ్ ఇంజనీర్ సూర్య ప్రకాష్, సిబ్బంది ఫరీద్, పాషా, దిలీప్, వీరస్వామి, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్పీడీసీఎల్ సంస్థ చైర్మన్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సెక్షన్ లో నిర్వహిస్తున్నట్లు ఏడి ఇ ఆకి టి స్వామిరెడ్డి తెలి పారు.