ఉప్పేడు, గొల్లగూడెంలో అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ.

ఉప్పేడు, గొల్లగూడెంలో అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ.

– ఎదురేగి గ్రామంలోకి తీసుకువచ్చిన అక్షింతల కలశాలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాడిపంటల రైతాంగ గ్రామమైన ఉఫ్ఫేడు గొల్లగూడెం గ్రామంలో శనివారం అయోధ్య రాముడి అక్షింతల కలశాల ను మండల కేంద్రమైన వెంకటాపురం నుండి అత్యంత భక్తి శ్రద్దలతో, సన్నాయి వాయిద్యాల మధ్య జై శ్రీరామ జై జై శ్రీరామ అయోధ్య రామ అంటూ భక్తజనం ఊరేగింపుగా కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. వెంకటాపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నుండి అయోధ్య రాముడి అక్షింతల కలశాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉప్పేడు గొల్లగూడెం గ్రామం యావత్తు రైతులు,శ్రీ రామభక్తులు , ఆబాల గోపాలం,శ్రీ రామభక్తులు భక్త సోదరీమణులు పెద్ద సంఖ్యలో వెంకటా పురం తరలివచ్చి శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో అయోధ్య రాముడు అక్షింతల కలశాలను గొల్ల గూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి మందిరం వద్దకు మంగళ వాయిద్యాల మధ్య, జై శ్రీరామ జై జై శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహా మంత్రంతో స్వామివారి అక్షింతలను కలశాలను రామభక్తులు ఆంజ నేయస్వామి మందిరంలో పూజలు చేశారు. గ్రామస్తులంద రూ కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామంలో వ్యవసాయ పనులు సైతం మానుకొని, శ్రీరామ జయ రామ అంటూ భక్త సోదరిమణులు, భక్తులు శ్రీరామ భక్తులు ఆబాల గోపాలం అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, శ్రీరామ జన్మభూమి క్షేత్ర ఆధ్వర్యంలో నిర్వ హించే అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు నిర్వహిం చారు. శనివారం గడప గడపకు శ్రీరామ అక్షింతలు ఇంటిం టికి శ్రీరామనామ అక్షింతలు అనే నినా దంతో ఆనందకరమైన వాతావరణంతో స్వామివారి విగ్రహ ప్రతిష్ట శుభముహూర్త ం లో అక్షింతలకు ప్రాధాన్యత ఇస్తూ, స్వామివారి విగ్రహ ప్రతిష్ట రోజు ఐదు దీపాలు వెలిగించాలని ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలని ,కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండగ జరుపుకోవాలని ,ఈ సందర్భంగా రామ భక్తులు, తమ గృహములకు అక్షింతలతో, శ్రీరామ జన్మభూమి లో నిర్మితమవుతున్న దివ్య మందిర వివరాలతో కూడిన అందమైన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. శ్రీ రామ జయ రామ జయజయ రామ అంటూ గొల్లగూడెం రైతాంగ పాడి పరిశ్రమల గ్రామం శ్రీరామ నామ జపంతో మారుమోగు తున్నది. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి మందిరం వద్ద భక్తుల సందడితో గ్రామం యావత్తు శ్రీరామనామం జపంతో పునీతులయ్యారు. తమ గ్రామాలు లో పాడిపంటలు సక్రమం గా పంటాలని, సకల జనులు సుఖశాంతులతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆయు రారోగ్యాలు కలిగి ఉండాలని, అందరికీ శుభం కలగాలని, అయోధ్య శ్రీరామ జై జై రామ జై శ్రీ ఆంజనేయ అంటూ అశేష భక్తజనం స్వామివారికి ముక్త కంఠంతో భక్తి భావంతో జై శ్రీరామ జై అయోధ్య రామ అంటూ వేడుకుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment