కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

– శని త్రయోదశి సందర్భంగా భక్తుల రద్దీ

కాళేశ్వరం, తెలంగాణజ్యోతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం శని త్రయోదశి సందర్భం గా అనుబంద దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాల వద్ద శనివారం భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి కాలసర్ప, శని నివారణ పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేకo, అమ్మవారికి కుంకుమ ఆర్చన పూజలు నిర్వహించారు దీంతో ఆలయ పరిసరాలు గోదావరి తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులు ఆచరించిన వివిధ పూజ లు,లడ్డు ప్రసాదాల పై ఆలయానికి 4,38,000 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment