నేర నియంత్రణ మరియు పరిశోధనలో ఇంకా వేగం పెంచాలి

నేర నియంత్రణ మరియు పరిశోధనలో ఇంకా వేగం పెంచాలి

నేర నియంత్రణ మరియు పరిశోధనలో ఇంకా వేగం పెంచాలి

– ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐ.పి.ఎస్

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  నేర నియంత్రణ పరిశోధనలో ఇంకా వేగం పెంచాలని, శాంతి భధ్రతల పరిరక్షణలో ప్రజా సహకారంతో అసాంఘిక శక్తుల కార్య కలాపాలను అరికట్టాలని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ అధికారులను ఆదేశించారు. సోమవారం వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా నేర నియంత్రణ పరిశోధన అంశాలపై సమీక్షించి అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి  5 ఎస్ వర్టికల్ పరంగా మెన్ యొక్క పనితీరు,  వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా నేత్రాలైన సి.సి.టి.వి ల పనితీరుని కమాండ్ కంట్రోల్ ద్వారా చెక్ చేశారు. అదేవిధంగా అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాలని, సిబ్బంది గ్రామాలను సందర్శించినప్పుడు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని, గ్రామాలలో వారి రాకపోకలపై కన్నేసి ఉంచాలని, మావోయిస్టులు అమాయక ఆదివాసి ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కేసులలో అరెస్ట్ అయిన మావోయిస్టు పార్టీ సభ్యులను, సానుభూతిపరులను అనునిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. వెంకటాపురం గోదావరి నది పరివాహక ప్రాంతమైనందున ఇసుక అక్రమ రవాణా పై దృష్టి సారించాలని, అక్రమంగా ఇసుక తరలించే వారి పైన కఠిన చర్యలు తీసుకోని వాహనాలను సీజ్ చేయాలని, వారికి సహకరిస్తున్న వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని, గోదావరి ఇసుక క్వారీ లపై న ఆకస్మిక తనిఖీ లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్.ఐ కె. తిరుపతి రావు,సివిల్, మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment