రాపల్లికోటలో కార్డెన్ సెర్చ్

రాపల్లికోటలో కార్డెన్ సెర్చ్

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండ లం రాపల్లికోట గ్రామంలో మహదేవపూర్ ఎస్సై కే.పవన్ కుమార్ మరియు కాలేశ్వరం ఎస్ఐ చక్రపాణి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా రాపల్లికోట గ్రామంలో ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వారి ఇళ్లల్లో గల వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలను పరిశీలించారు.నెంబరు ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్ర మాలకు, పనులకు చోటు ఇవ్వద్దని, నిషేధిత గుడుంబా ఎవరు అమ్మోద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అలాగే యువత బాగా చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆశించారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న పోలీసు లకు తెలపాలని సూచించారు, ఇంకా సిసి కెమెరాలు ప్రాము ఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ కానిస్టేబుల్ కిషన్, తిరుపతి, అనంత్, చంద్రమోహన్, హోంగార్డ్ మట్టి బాబు, భూపాలపల్లి జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు,తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment