శ్రీపాద స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: శ్రీపాద స్మారక ఐదు మండలాల స్థాయి జీ పీ ఎల్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరులు దుద్దిళ్ల శ్రీను బాబు ప్రారంభించారు. శుక్రవారం కాటారం మండల కేంద్రం లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లో నిర్వహిస్తున్న శ్రీపాద స్మారక ఐదు మండలాల స్థాయి జీ పీ ఎల్ 1 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగ పాల్గొని టోర్నమెంట్ నీ శ్రీను బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీను బాబు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది కావున అందరూ సాధ్యమైనంత వరకు ఈ క్రీడలో అయిన రోజులో కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్య వంతంగా జీవించ వచ్చని అన్నారు. యువకులు కేవలం చదువుతూనే కాకుండా క్రీడా రంగం లో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందని, అలాగే యువతి యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడా రంగం లో ముందుకు వెళ్ళాలని కోరారు.