వెంకటాపురంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వెంకటాపురంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వెంకటాపురంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం నూగూరు, వాజేడు  మండలాల్లో బుధవారం రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం వాజేడు మండలం టేకుల గూడెం, నాగారం, ఎజ్జర్లపల్లి, వెంకటాపురం మండలం వెంకటా పురం, పాత్రపురం గ్రామాలలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండ గా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితి రాజ్ ఈ.ఈ. అజయ్ కుమార్, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment