శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా వారికి అర్చకులు రాజగోపురం నుండి పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం అర్చక స్వాములు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఏమార్వో ప్రహ్లాద్ రాథోడ్ ,ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.