మల్లంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ
– టిబి, లిప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి పోరిక రవీందర్
ములుగు, తెలంగాణ జ్యోతి : మండలంలోని మల్లంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ములుగు జిల్లా టిబి, లిప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.పోరిక రవీందర్ సోమవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేసారు. క్షయ వ్యాధి అనుమానిత రోగస్థులను పరీక్షించారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించాలని అన్నారు. నాణ్యమైన తెమడని సేకరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మహ్మద్ గౌస్ పల్లిలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలకు అందించే ఆహారం గూర్చి అడిగి తెలుసుకున్నారు. కొంత మంది పిల్లలు దగ్గు, జలుబుతో ఉండగా పరీక్షించి మందులు అందజేశారు.
1 thought on “మల్లంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ ”