బొగత జలపాతంలో బిటెక్ విద్యార్థి మృతి
వాజేడు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల చికుపల్లి బోగత జలపాతంలో బిటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) తన స్నేహమిత్రులైన సాయి, కిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ, గౌస్ తో కలిసి బొగత జలపాతాన్ని తిలకిం చడానికి వచ్చారు. బొగత జలపాతం లో స్థానం చేస్తుండగా వరద ఉదృతంగా ఉండడంతో జస్వంత్ నీటమునిగాడు. విషయం తెలుసుకున్న వెంకటా పురం సీఐ బండార్ కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైనది. ఈ యువకుడు వాగ్దేవి కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తోటి మిత్రులతో కలిసివచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.