వెంకటాపురం లో బిఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలు. 

వెంకటాపురం లో బిఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలు. 

  • ప్రారంభించిన సీనియర్ నాయకులు వేల్పూరిలక్ష్మీనారాయణ 

వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మలుగు జిల్లా వెంకటాపురం మండలం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద మంగళవారం బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడడం కొరకు భద్రాచలం నియోజకవర్గం లొ, డాక్టర్ తెల్లం వెంకటరావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వెంకటాపురం మండలంలో శివాలయం దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ప్రచార రథాలను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు పూనం శ్రీదేవి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పిల్లారిసెట్టి మురళి, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి డర్ర దామోదర్, రాచపల్లి సర్పంచ్ స్వర్లం సమ్మయ్య, సీనియర్ నాయకులు జాగర శాంతమూర్తి యాదవ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గొర్ల శ్రీను, బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు జాగర్ శివాజీ యాదవ్, మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కిరణ్ ,బోల్లె శంకర్రావు, మల్లేష్, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపురం లో బిఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలు.