ప్రధాని మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేసిన బీజేపీ నాయకులు

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేసిన బీజేపీ నాయకులు

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేసిన బీజేపీ నాయకులు

– కుల గణన అన్నీ వర్గాల ప్రజలకు న్యాయం

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి :  మండల కేంద్రంలోని అంబెద్కర్ విగ్రహం ఎదుట మండల అధ్యక్షులు వినుకొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పళ్ళ బుచ్చయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలంటే కుల గణన తప్పనిసరని, అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాష్ట్రాల్లో కొనసాగించాలని అమలు చేసిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కర్ణ సంపత్, సీనియర్ నాయకులు ఎర్రల ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షులు అటిక నాగేశ్వరరావు, దుర్గం దుర్గారావు, బూత్ అధ్యక్షులు అటిక కృష్ణ, చెన్న ప్రశాంత్, ఎర్రల్ల శ్రీకాంత్, బోడ రాజు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దుర్గం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment