పెండింగ్ భూ సమస్యలకు భూభారతితో మోక్షం

పెండింగ్ భూ సమస్యలకు భూభారతితో మోక్షం

పెండింగ్ సమస్యలకు భూభారతితో మోక్షం

 – కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ 

– 30 రోజుల్లో మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం. 

– రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

– భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు.

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : ధరణి కారణంగా యేండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రైతు భూ సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం కలగనుందని భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామం లోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్ర మానికి భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తో కలిసి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లా డుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. ఏ తప్పూ చేయకుండానే రైతుల ను, అధికారులను ధరణి దోషులుగా నిలబెట్టిందని పేర్కొన్నా రు. ధరణి చట్టంలోని లోపాలు రైతులు, అధికారుల మధ్య గొడవలు సృష్టించేలా చేశాయని, రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది మేధా వులు, రాజకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు, అధికారులతో చర్చించి మెరుగైన ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొం దించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు నిర్ణయించారని తెలిపారు. వారి సూచనలు, సలహాలు మేరకు భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ చట్టం ద్వారా పేరుకుపోయిన భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతా యని అన్నారు. భూభారతి చట్టంలో అప్పీలు వ్యవస్థ ఉండడం ద్వారా రైతులు అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులకు అప్పీలు చేసుకోవచ్చని అన్నారు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని చెప్పారు. వారసత్వ భూముల మ్యూటేషన్ కు ఈ చట్టంలో సత్వర పరిష్కారం లభిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలం లోపు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ఈ అర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యం తరాలు ఉంటే అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. మొదటి అంచెలో ఆర్డీఓ అప్పీలును పరిశీలించి తగు నిర్ణయం తీసుకుం టారని, అయినా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని, ల్యాండ్ ట్రిబ్యునల్ ను కూడా అప్పీలు చేసుకు నేందుకు భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుందని వివరిం చారు. రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని పరిష్కరించి, రైతుల భూములపై వారికి హక్కులు ఏర్పరుస్తూ, వారికి పూర్తి భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టా పాస్ బుక్కులలో సమగ్ర వివరాలతో, హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాప్) పొందుపరుస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు సర్వే మ్యాప్ రూపొందించి పట్టా పాస్ బుక్కుకు జత పరుస్తారని అన్నారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూధార్ నెంబర్ కేటాయిస్తారని తెలిపారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసా యేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు. ఎవరైనా మోసపూరితంగా హక్కుల రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే అలాంటి పట్టాలను రద్దు చేసే అధికారం భూభారతి ద్వారా అధికారులకు కల్పించారని వివరించారు. ధరణిలో కొన్ని భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉండేది కాదని, అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తహసీల్దార్, ఆర్డీఓ లకు దరఖాస్తులు చేసుకుని సమస్యలు పరిష్కరించుకునేలా భూభా రతి వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు.. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను కోర్టు స్టే విధించడం వల్ల ధరణిలో పరిష్కరించేందుకు అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీ లించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహనను పెంపొందించుకుని, భూ సమస్యలు ఉంటే గ్రామ సభలలో అధికారులకు అర్జీలు అందించి పరిష్క రించుకోవాలని, ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తో కలసి మండల పరిధి లోని కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ చెక్కులను 15 మంది లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్ర మంలో మండల ప్రత్యేక అధికారి అప్పలనాయుడు, తహసిల్దార్ లక్ష్మీ రాజయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్, స్థానిక అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ భూ సమస్యలకు భూభారతితో మోక్షం

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment