చిడెం సాయి ప్రకాష్ తల్లిదండ్రులను పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వంచంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు చిడెం సాయి ప్రకాశ్ ఇటీవల హనుమ కొండలో దారుణ హత్య గురైన విషయం విధితమే. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం వెంకటాపురం, వాజేడు మండలాల పర్యటనలో భాగంగా సాయి ఇంటికి వెళ్లి తల్లి దండ్రులను పరామర్శించారు. హంతకులను కఠినంగా శిక్షించే విధంగా, కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు ఉన్నతా ధికారులతో మాట్లాడానని ఎటువంటి అధైర్య పడకుండా వుండా లని తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించారు. సాయి ప్రకాష్ ప్రజల మనిషిగా, పేదల గుండెల్లో దాగి ఉన్నాడని చిన్న వయసు లోనే అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపు రం సొసైటీ అధ్యక్షులు చిడెం మోహన్ రావు కాంగ్రెస్ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, అదికార ప్రతినిధి శ్రీరాములు రమేష్, వాజేడు కాంగ్రెస్ నాయకులు రాజు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.