నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

– జాతీయ కోఆర్డినేటర్ కు విజ్జగిరి సమ్మయ్య వినతి

తెలంగాణ జ్యోతి, కాటారం: జాతీయ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల నామినేటెడ్ పోస్టుల నియామకాలలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ బీసీ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి విజ్జగిరి సమ్మయ్య కోరారు. మంగళ వారం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ. టిపిసిసి అధికార ప్రతినిధి, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి, తెలంగాణ బీసీ ముద్దుబిడ్డ ఉద్యమ నాయకుడు కత్తి వెంకటస్వామి గౌడ్ తొలిసారి భూపాలపల్లి జిల్లాకు పర్యటనకు వచ్చినందున వారిని మర్యాధపూర్వంగా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కలిసి శాలువతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి విజయగిరి సమ్మయ్య నాయి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ కుల గణన వెంటనే ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. ప్రభుత్వం స్థానిక సంస్థ ఎలక్షన్ లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీ కులాల కార్పొరేషన్ లో ఏర్పాటు మరియు పాలకవర్గాలను నియమించాలని సూచించారు. ప్రతి కార్పోరే షన్కు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు కేటాయించాలని. ప్రభుత్వం ఇచ్చే నామినేట్ పోస్టులలో బడుగు బలహీన వర్గాల బీసీలను గుర్తించి ఎంపిక చేయాలని విన్నవించారు. ఎమ్మెల్యేగా అవకాశం లేని కులాలకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల బీసీల సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు జాతీయ బీసీల కోఆర్డినేటర్ వెంకట స్వామి సానుకూలంగా స్పందించి బీసీల అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారని సమ్మయ్య తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment