పహల్గాం ఉగ్రదాడి మృతులకు బెటాలియన్ పోలీసుల నివాళి
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన టూరిస్టులకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి 5వ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నివాళులర్పించారు. శుక్రవారం బెటాలియన్ లో ఇన్చార్జి కమాండెంట్ సుబ్రహ్మణం ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రవాద దాడిలో మృతులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి సాహసాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ వారి కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. పోలీస్ శాఖలోని స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ ఎల్లపుడు శాంతిని కాపాడటానికి, ప్రజల రక్షణ కోసం నిరంతరం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ విషాద సమయంలో కాశ్మీర్ ప్రజలతో కలసి నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐలు శోభన్ బాబు, కార్తీక్, శ్రీనివాసులు, సాల్మన్ రాజు, రాంప్రసాద్, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.