పోలిస్ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ పోస్టర్ ఆవిష్కరించిన ఎఎస్పీ
ఏటూరునాగారం తెలంగాణ జ్యోతి : పోలీసు సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుపాలని కోరుతూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ ను ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డీజీపీ, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు తెలియజేయడం కోసం క్యూఆర్ కోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం ద్వేయంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, వాజేడు మండలం పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్, వెంకటాపురం సిఐ బండారి కుమార్,వాజేడు ఎస్సై ఎన్.రాజకుమార్, వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.