మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Written by telangana jyothi

Published on:

మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్.

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లాలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 30న పర్యటించనున్నారు.ఈ పర్యాటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ దివాకర్ టి.ఎస్. కన్నాయి గూడెం మండలంలోని దేవాదుల ఇంటెక్ వెల్ పంప్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ మంత్రి పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, రహదారి, రివ్యూ సమావేశ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. అనంతరం తుపాకులగూడెం గ్రామం లోని ఆశ్రమ పాఠశాలను,గుట్టల గంగారాం అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడి చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందిం చాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరి గేషన్ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్,డి ఈ ప్రవీణ్, శరత్, తహసిల్దార్ సలీం, ఎం పిఓ, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now