ములుగుకు చేరిన అయోధ్య శ్రీరాములవారి అక్షింతలు

ములుగుకు చేరిన అయోధ్య శ్రీరాములవారి అక్షింతలు

ములుగు, డిసెంబర్29, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అయోధ్య శ్రీరాములవారి అక్షింతల వితరణ కార్యక్రమం తీర్థ క్షేత్ర ట్రస్ట్ ములు గు శాఖ  ఆధ్వర్యంలో స్థానిక  రామాలయంలో  నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలోని పురవీధుల గుండా శోభాయాత్ర అత్యం త వైభవోపేతం గా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొదటగా రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగ ల్ విభాగం విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి నందాల చంద ర్ బాబు మాట్లాడుతూ అయోధ్య శ్రీ రాముల వారి నుండి విచ్చేసిన అక్షింతల ప్రాధాన్యత అంటే ఏమిటో సవివరంగా అందరికీ వివరిం చారు. తర్వాత జనవరి ఒకటి నుంచి 15 వరకు ఈ అక్షింతల విత రణ కార్యక్రమం ప్రతి ఇంటికి, ప్రతి గడపకు,ప్రతి కుటుంబానికి చేర వేయడo వాటిని ఏ విధంగా భద్రపరచడం గురించి తెలిపారు. అయోధ్యలో జనవరి 22న జరగబోయే ప్రాణ ప్రతిష్ట అందరూ కలి సి సామూహికంగా దేవాలయ ప్రాంగణంలో ప్రత్యక్ష ప్రసార సాధనా లలో చూడడము, అదేవిధంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం పలకడం వంటి విషయాలను వివరించారు. అదేవిధంగా రామమందిర నిర్మాణం కొరకు జరిగిన సంఘటనలు, సవాళ్లు అనేక దశల వారి ఘటనలను, ప్రపంచమంతా అబ్బుర పోయే విధంగా శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతున్న విధానము సవివరంగా తెలిపారు. అదేవిధంగా వరంగల్ విభాగ్ ప్రముఖులు కడమంచి విగ్నేశ్వర్ జి పాల్గొని అయోధ్య విశిష్టత గూర్చి తెలియ పరిచారు. అనంతరం అయోధ్య శ్రీ రాములవారి అక్షింతలను ఇత ర గ్రామాల నుండి వచ్చిన వారు తమ శిరస్సుపై ఎత్తుకొని శోభా యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భజన, కోలాటం మహిళా బృందాలు మరియు అయ్యప్ప హనుమాన్ స్వాములు, రామ భక్తులు, ఇతర గ్రామాల నుండి విచ్చేసిన వారు సంప్రదాయ వేష ధారణలతో భజన పాటలు పాడుకుంటూ కోలాటాలు వేసుకుం టూ ములుగు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి గుండా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.శోభాయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో మహి ళలు మంగళహారతులతో స్వాగతం పలకారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ములుగు జిల్లా సంయోజకులు ముక్కు సుబ్బారెడ్డి, సేవిక సమితి ప్రముఖులు వాంకుడోత్ జ్యోతి, కొత్తపల్లి పోషన్న, శిరుప సతీష్, భాషవేన మహేందర్, గొల్ల కుమార్, సిరికొండ బలరాం, చింతల పూడిభాస్కర్ రెడ్డి, గుగులోతు స్వరూప, దొంతి రెడ్డి వాసు దేవ రెడ్డి, చుంచు రమేష్, గంగిశెట్టి రాజు, మెరుగు రమేష్, కొండ్ల్లె శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ములుగుకు చేరిన అయోధ్య శ్రీరాములవారి అక్షింతలు”

Leave a comment