ఏజెన్సీ చట్టాలకు తూట్లు
– యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
– నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం
– అధికారుల చేతి వాటానికి ఏజెన్సీ చట్టాలు నిర్వీర్యం
– జిఎస్పి ములుగు అధ్యక్షుడు పూనెం ప్రతాప్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఏజెన్సీ ప్రాంత చట్టాలు,నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టెట్, భూదందాలు పెచ్చు మీరిపోతున్నా అధికారులు సెటిల్మెంట్లు చేసుకొని జేబులు నింపుకుంటున్నారని గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ మండిపడ్డారు. గొండ్వానా సంక్షేమ పరిషత్ సంఘం ముఖ్య కార్యకార్తల సమావేశం చర్ల మండల జిఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం వెంకటాపురంలో నిర్వహిం చగా ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ పాల్గొని మాట్లా డుతూ ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురంలో ఎల్.టి.ఆర్ 1/70 కళ్లు గప్పేందుకు, గిరిజనేతరులు, ధనికవర్గాలు ప్రభుత్వ భూములను కోట్లాది రూపాయలతో కొనుగోలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపార దందా సాగిస్తున్న తీరు చర్చనీయాంశమైంద న్నారు.మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూములు, గిరిజనే తరులు రియల్ ఎస్టేట్ దందా యథేచ్ఛగా కొనసాగిస్తూ భారీ ఎత్తున భవన సముదాయాలు నిర్మిస్తున్నా,అధికార యంత్రాం గం మాత్రం మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నాయని ఏజెన్సీ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు చేతివాటానికి అలవాటు పడి ఏజెన్సీ చట్టాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శులు సైతం అనుమతులు లేని భవనాలకు నోటీసులకు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని పూనెం ప్రతాప్ అన్నారు. రెవిన్యూ అధికారులు ఎల్.టి.ఆర్ 1/70 చట్టాలను ఆదివాసుల పైనే ప్రయోగిస్తూ గిరిజనేతరుకు వెసులు బాటు కల్పిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు పూర్తిస్థాయి లో విచారణ జరిపి గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలపై ఎల్టిఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళి క సిద్ధం అవుతోందని అధికారులను హెచ్చరించారు. ఈ సమా వేశంలో ఇర్ప అరుణ్ కుమార్, కోరం బన్నీ, పూనెం రవి కిరణ్, ఇర్పా అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు.