అశోక్ నగర్ లో ధాన్యం కొనుగోలు వేగవంతం

Written by telangana jyothi

Published on:

అశోక్ నగర్ లో ధాన్యం కొనుగోలు వేగవంతం

– ఎమ్మెల్యే దొంతి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

– దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తక్కళ్లపెల్లి రవీందర్ రావు

– సివిల్ సప్లై అధికారులు

తెలంగాణ జ్యోతి,  ఖానాపురం : మండలంలోని అశోక్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి 3 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం ను తక్షణం మిల్లులకు  తరలించాలని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాలతో హుటా హుటిన అధికార యంత్రాంగంతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్ రావు తగు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ అదనపు కాంటాలను ఏర్పర్చడం, ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను రప్పించ డం ట్రాన్స్ పోర్ట్ లారీలను పెంచడం ప్రత్యక్షంగా పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిస్తే రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించిన నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి తక్షణమే జిల్లా పౌరసరఫరాల అధికారులను పురమాయించటంతో సివిల్ సప్లై అధికారిని సంధ్యరాణి, డియం స్వప్న, డి టి లతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్ రావు కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే తరలించటానికి ఏర్పాట్లు చేసి, అధిక లారీల సహాయంతో ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now