మేడారంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం
– ఒకరి పరిస్థితి విషమం
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బస్సును ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏటూరు నాగారంకు ఓడ వాడకు చెందిన బాస రాజ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికు లు హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు.