వికసించిన అరుదైన మే పుష్పం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రతి ఏడాది మే నెల రెండో వారంలో వికసించే అరుదైన మే పుష్పం పూర్తి అందాలను విరజిమ్ముతూ వికసించింది. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని నేలార్ పేట వీది లో నివసిస్తున్న రైతు శుద్ధపల్లి సత్యనారాయణ, సత్యవతి దంపతుల గృహ ఆవరణలో పుష్పం వికసించింది. ఎంతో జాగ్రత్తగా పెంచి పోషిస్తున్న మే పుష్పం దుంప జాతి మొక్క ప్రతి ఏడాది మే నెల మొదటి వారంలో మొగ్గ తొడిగి రెండో వారంలో అందాలను విరజింపుతూ వారం, పది రోజులు పాటు అలాగే ఉండి తర్వాత రేఖలు రాలిపోతాయి. అరుదదైన మే పుష్పా న్ని ఆవీధిలోని ఇరుగు పొరుగువారు చూసి తమ సెల్ఫోన్లో బంధించారు.