కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : పదవ తరగతి పరీక్షల లో కన్నాయిగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు ప్రణాళిక బద్దంగా పదవ తరగతి పిల్లలను పరీక్షలకు సంసిద్ధులను చేయగా 11 మందికి గాను 11 మంది ఉత్తీర్ణత సాధించారు. 600 మార్కులకు గాను 499 మార్కులతో చర్ప సిద్దు మొదటి స్థానం, రెండవ స్థానంలో అశోక్ 469 మార్కులు సాధించారు. వీరిని ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు అభినందించారు