భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.
తెలంగాణ జ్యోతి, నవంబర్ 17, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా రేగొండ మండల శివారులో గురువారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి సీరియస్ గా వున్నట్లు సమాచారం… మొగుళ్ళపల్లి మండలంలో ఓ వివాహానికి హాజరై గురువారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మండ లంలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన పూజారి పవన్ (23) సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన చింతల సాయి కిరణ్(23)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.