బిజెపిలో పలువురు చేరిక

Written by telangana jyothi

Published on:

బిజెపిలో పలువురు చేరిక

 తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో పలువురు చేరారు. కాటారం మండలం దేవరాపల్లి , దంతాల పల్లి గ్రామాల్లోని యువకులు బోనాల మహేష్, అంతటి దేవేందర్, చెన్నూరు అశోక్ తో సహా 50 మంది యువకులకు కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పర్తిరెడ్డి హనుమయ్య, మండల ప్రధాన కార్యదర్శి పూసాల రాజేంద్రప్రసాద్, రేగులగూడెం సర్పంచ్ దోమ రాహుల్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జిల్లాల శ్రీశైలం, మండల యువ మోర్చా అధ్యక్షులు బొడ్డు శివ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now